వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నారై (ప్రవాస భారతీయుల) విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీన కువైట్లోని ఖదసియా స్టేడియంలో ‘గల్ఫ్ ప్రవాసాంధ్ర ప్రస్థానం’ మహాసభ జరుగుతుందని కన్వీనర్ మేడపాటి వెంక ట్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వైఎస్సార్ కాంగ్రెస్ కువైట్ కమిటీ ఆధ్వర్యంలో ఇలియాస్ బి.హెచ్ సమన్వయకర్తగా జరుగుతున్న ఈ మహాసభకు పార్టీ ముఖ్య నేతలు జూపూడి ప్రభాకరరావు, మాజీ ఎమ్మెల్యేలు ఆకేపాటి అమరనాథరెడ్డి, కె.శ్రీనివాసులు, గడికోట శ్రీకాంత్ రెడ్డి, రఘురామిరెడ్డి, అంబటిరాంబాబు, హెచ్.ఏ.రెహ్మాన్, సురేష్బాబు, రాజ్ ఠాగూర్, రామ్మోహన్ హాజరవుతారని ఆయన తెలిపారు. వీరంతా 22న కువైట్కు ప్రయాణం అవుతున్నట్లు ఆయన వివరించారు. గల్ఫ్ ప్రవాసాంధ్రుల సమస్యల పరిష్కారం కోసం ఈ మహాసభను ఒక వేదికగా ఉపయోగించుకుంటామనీ భవిష్యత్తులో మరిన్ని దేశాల్లో ఇటువంటి సదస్సు నిర్వహించబోతున్నామనీ ఆయన తెలిపారు.
అట్లాంటా: రాజ్యాంగ నియమాల్ని, నిబంధనల్ని ఉల్లంఘించి వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని రాజకీయంగా అణిచివేసేందుకు కుట్ర జరుగుతోందని ఎన్నారై గురువారెడ్డి అభిప్రాయపడ్డారు. కుట్రలో భాగంగానే యూపీఏ అధినేత్రి సోనియాగాంధీ, ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, గవర్నర్ నరసింహాన్, స్పీకర్ నాదెండ్ల మనోహర్ , ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడులు ఓ పథకాన్ని రచిస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో జరిగే ఉప ఎన్నికల్ని ప్రశాంతంగా, స్వేచ్ఛగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి (సీఈసీ) ఎస్వై ఖురేషిని గురువారెడ్డి కోరారు. ఈ మేరకు సోమవారం సీఈసీకి బహిరంగ లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగ విలువల్ని పునరుద్దరించేందుకు అవసరమైన చర్యలు తీసుకొవాలని లేఖలో కోరారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పేరును సీబీఐ ఎఫ్ఐఆర్లో చేర్చడాన్ని నిరసిస్తూ 17 మంది వైఎస్ఆర్ అభిమాన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి, తమ శాసన సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు అనివార్యమైన సంగతి తెలిసిందే.
Service Name                                                Contact
Anti Corruption                                                      14400
Fire Services                                                            101
Health Advisory Helpline                                           104
Tele Medicine Services                                          14410