
మొదటి సంవత్సరంలో ఆరు లక్షల ఎకరాలు, రెండో సంవత్సరంలో నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి రూ.1,800 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. కానీ అంచనాలన్నీ తలకిందులయ్యాయి. మొదటి ఏడాది ఆరు లక్షల ఎకరాలు సాగులోకి తేవాలంటే 10 ఎకరాలకు ఒక బోరు చొప్పున 60 వేల బోర్లు వేయాల్సి ఉంది. అంటే నెలకు 5 వేల బోర్ల చొప్పున వేస్తేగానీ లక్ష్యం నెరవేరదు. పథకం ప్రారంభించి ఏడు నెలలు అవుతుండగా 35 వేల బోర్లు వేయాల్సి ఉన్నా.. ఇప్పటికి 1,801 బోర్లు మాత్రమే తవ్వారు. వీటిలోనూ ఒక్కటి కూడా పంటలకు నీరందించేందుకు సిద్ధం కాలేదు. బోర్లు వేసిన కొన్నిచోట్ల విద్యుత్ కనెక్షన్లు ఇవ్వకపోవడం, ఇచ్చినా మోటారు లేకపోవడం సమస్యలతో రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క బోరు కూడా పూర్తిస్థాయిలో సిద్ధం కాలేదు.
0 Comment :
Post a Comment